ఫోన్ ట్యాపింగ్ లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ.. 1 y ago
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్రావు, ఏ-6గా ఉన్న శ్రవణ్ రావు లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెడ్ కార్నర్ నోటీసులపై బుధవారం ఉదయం CBI నుంచి రాష్ట్ర CIDకి సమాచారం ఇవ్వనున్నారు. ఇందులో నిందితులుగా ఉన్న వారిని వీలైనంత త్వరగా.. భారత్ కు తీసుకురావాలని కేంద్ర హోంశాఖతో పాటుగా విదేశాంగ శాఖలతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.